పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అపురూప దర్శనం..చూసిన కనులదే భాగ్యం...

చిత్రం
 ఏడాదిలో ఒక్కరోజే దర్శన భాగ్యం.... సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూపాన్ని వీక్షించే అదృష్టం భక్తులకు కలుగుతుంది. వరాహ నారసింహ అవతారాల సమ్మేళనంగా విరాజిల్లుతున్న సింహాద్రి నాథుడి నిజరూపాన్ని వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం ఈరోజు కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తుల విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూపంలో సంవత్సరంలో ఒక్క రోజున మాత్రమే అక్షయ తృతీయనాడు దర్శనమిస్తారు. ఆ రోజున స్వామి వారిని లక్షలాదిమంది దర్శించుకుని భక్తి పారవస్యంతో పునీతులవుతారు.  ఏడాది పొడవునా చందనం పూతతో ఉంటూ శాంతమూర్తిగా దర్శనమిచ్చే వరాహస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు... త్రిలోకాలలో నారసింహుని వంటి దైవం, సింహాచల క్షేత్రం వంటి పుణ్యక్షేత్రం, నిరంతరం ప్రవహిస్తూ మనల్ని పునీతులను చేసే గంగధార వంటి తీర్థం లేదని చెబుతుంటారు. ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చిన నరసింహ స్వామి సింహగిరిపై వరాహ నారసింహ అవతారంలో దర్శనమిస్తున్నారని ప...

కలిశెట్టి యోగేంద్రకు డాక్టరేట్

చిత్రం
 కలిశెట్టి యోగేంద్రకు డాక్టరేట్ ఆంధ్ర విశ్వకళా పరిషత్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల గణాంక విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి కలిశెట్టి యోగేంద్ర “సమ్ ఎకనామిక్ స్టాటిస్టికల్ డిజైన్ ఆఫ్ X బార్ కంట్రోల్ చార్ట్స్ విత్ ఎడిటివ్ ఎక్స్పొనెన్షియల్ అండ్ హైపోఎక్స్పోనెన్షియల్ షాక్ మోడల్స్ (SOME ECONOMIC STATISTICAL DESIGN OF X̄ CONTROL CHARTS WITH ADDITIVE EXPONENTIAL AND HYPOEXPONENTIAL SHOCK MODELS)” అనే అంశంపై ఆచార్య కట్నేని నిరుపమా దేవి మరియు సీనియర్ ఆచార్యులు క్రాలేటి శ్రీనివాసరావు (విశ్రాంత) గార్ల సంయుక్త పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను, “డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్ డీ)’’ పట్టాను గౌరవ ఉపకులపతి ఆచార్య జీ. పీ. రాజశేఖర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. కలిశెట్టి యోగేంద్ర గారు తన ఈ అవార్డును తల్లిదండ్రులు మరియు గురువులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా పర్యవేక్షకులు, బోధనా సిబ్బంది, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్రం
  ఔట్‌సోర్సింగ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ పై పరిశోధనకు  బొటుకు రమేష్ బాబుకు డాక్టరేట్  డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లాకళాశాలలో పిహెచ్‌డివిద్యార్థి అయినబొటుకు రమేష్ బాబుకు "ఔట్‌సోర్సింగ్ ఉపాధి: భారత రాజ్యాంగం మరియు పారిశ్రామిక న్యాయ శాస్త్రానికి విరుద్ధం" అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రకటించింది. పరిశోధనకు కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.విజయ లక్ష్మి గారు గైడ్ మరియు రీసెర్చ్ డైరెక్టర్ గా మార్గనిర్దేశం చేశారు. వీరి పరిశోధన ప్రభుత్వ రంగ మరియు ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలలోని కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్స్డ్ ఉద్యోగుల స్థితిగతులపై దృష్టి సారించింది, అనుభవపూర్వక అధ్యయనం ద్వారా ఈ ఉద్యోగులు తరచుగా యజమానులచే తీవ్రంగా దోపిడీ చేయబడుతున్నారని, చట్టబద్ధమైన ప్రయోజనాలు మరియు సామాజిక రక్షణను  పొందలేకపోతున్నారని గుర్తించింది.  అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై నియామకం ఉద్యోగుల మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల జీవితాలకు హానికరమని, వారి జీవించే హక్కు మరియు గౌరవాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనం వెల్లడించింది. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ తరచుగా ఒక మోసపూరిత...

మత్స్యకారులకు ఆర్ధిక సాయం పంపిణీ

చిత్రం
  మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట  గాజువాకలో రూ. కోటి 6 లక్షల ఆర్ధిక సాయం పంపిణీ    మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల సేవలో పథకం కింద గాజువాక నియోజకవర్గంలోని మత్స్యకారులకు ఆర్ధిక సాయం అందిస్తూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మరో మైలురాయి సాధించారు. ఈరోజు ఆయన దిబ్బపాలెం, గంగవరం, జాలరిపల్లెపాలెం గ్రామాల్లో 530 మంది మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.1 కోటి 6 లక్షల ఆర్ధిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, "మత్స్యకారులు సముద్రంలో వేట విరామ సమయంలో ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను తగ్గించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన 'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20,000 సాయం అందిస్తోంది. రాష్ట్రం మొత్తం 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.258 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గాజువాక నియోజకవర్గంలోనూ 530 మంది మత్స్యకార కుటుంబాలు ఈ ప్రయోజనం పొందాయి," అని చ...

పోలీసు సిబ్బందికి చల్లని వార్త....

చిత్రం
  పోలీసులు...కూల్ గా సేవలు అందిస్తారు... థాంక్యూ.... కమీషనర్ సాబ్ అసలే వేసవి కాలం...ఎండలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి....కాలు బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది...అటువంటిది పోలీసులు గంటల తరబడి ఎండలో నిలబడి విధులు నిర్వహించడం కష్టతరమైన విషయం. మరి మన బధ్రత కోసం పనిచేసే పోలీసులకు చల్లని వార్త వినిపించడం కాదు....చూపించారు...నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి...నగర పౌరుల బధ్రతతో పాటు...తమ సిబ్బంది యోగక్షేమాలనుచు సైతం చూడడం కమిషనర్ కు అలవాటే... తమ సిబ్బంది కోసం ఆయన ఒక వినూత్న ప్రయత్నం చేశారు. మండువేసవల సైతం కూల్ కూల్ గా వారు విధులు నిర్వహించాలని భావించి, వారికి సరికొత్త కూల్ జాకెట్ లను సమకూర్చారు. వారి కష్టాన్ని తెలుసుకుని చొరవ తీసుకున్న పోలీస్ బాస్ కి మనసారా ధన్యవాధాలు... కొత్త  ప్రయత్నం పోలీసులకు మేలు చేయాలని మనసారా కోరుకుందాం.... విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వేసవి ఎండల నుండి ఉపశయం లభించింది. గత   అక్టోబర్ లో ఢిల్లీలో జరిగిన "ట్రాఫిక్ ఎక్స్ పో" లో ట్రాఫిక్ విభాగ నుండి ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు వెళ్...

నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు

చిత్రం
  కన్వెన్షన్ సెంటర్ పనులు వేగవంతం చేయాలి వి.ఎం ఆర్ డి ఎ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సాంకేతిక విభాగపు సమీక్షా సమావేశంలో పాల్గొన్న చైర్మన్  ఎం.వి ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. జోన్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని చీమలపల్లి మరియు ఎండాడ వద్ద సంస్థ నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభోత్సవం జరిపి అందుబాటులోకి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వెంకోజిపాలెంలో పునః నిర్మిస్తున్న కళ్యాణమండపం పనులను కూడా పూర్తి చేసి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ దృష్టిలో పెట్టుకొని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణ పనులు నాణ్యతలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడవద్దని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమీషనర్ రమేష్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్ పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, బలరామరాజు, కార్యనిర్వహక ఇంజినీర్లు, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత

చిత్రం
 పేదవారికి అందుబాటులో ఉంటాను... ప్రజారోగ్యానికి ప్రాధాన్యతే ద్యేయం -నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విశాఖపట్నం ఏప్రిల్ 28; రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థిగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయరుగా ఎంపిక చేసి తనకు కీలక బాధ్యతలను అప్పచెప్పారని నగర మేయర్ గా ఎన్నికైన పీలా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నగర మేయరుగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశం మందిరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ మా తండ్రిగారైన పీల మహాలక్ష్మి నాయుడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసేవారని ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించిన మేయర్  బాధ్యతలను చిత్త శుద్ధితో నెరవేరుస్తానని, ముఖ్యంగా పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజారోగ్యానికి  ప్రాధాన్యతను ఇస్తానని, తక్కువ కాలంలో వచ్చిన ఈ పదవిని దాని విలువలను మరింత పెంచుతానని, ప్రతి ఇంటికి తాగునీరు సకాలం లో అందించేందుకు కృషి చేస్తానన్నారు. నగర అభివృద్ధి విషయం లో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తూ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వారికి అవసరమై...

ఆచార్యులకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

చిత్రం
  విద్యకు ప్రత్యామ్నాయం లేదు తల్లిదండ్రులు గర్వించే విధంగా  ముందుకు సాగండి ఎ యు తెలుగు విభాగం ఆచార్యులకు ఆత్మీయ సత్కారం విశాఖపట్నం : సమాజంలో దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుందని ఒక్క విద్యకు మాత్రమే లేదని  కాబట్టి ఈ రంగంలో ఎంత ఇష్టపడి చదివితే అంత మంచి ఉద్యోగం, ఉపాధి  సాధించవచ్చనని తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య జెర్రా అప్పారావు అన్నారు. సోమవారం ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన  ఆచార్యులు ఆత్మీయ సత్కార కార్యక్రమంకు సభాధ్యక్షత వహించిన ఆచార్య అప్పారావు మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో  చదువుకున్న వారంతా నేడు  ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. పీజీ పూర్తి చేసుకున్న విద్యార్ధులు వెంటనే  మరింత  ఉన్నత విద్య  అభ్యసించాలన్నారు. కష్టపడి చదివి పోటీ పరీక్షలులో  మంచి మార్కులు సాదించాలి అని ఆకాంక్ష వ్యక్తము చేసారు. చదువుకున్న వారికి అనేకమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అలాగే గర్వం లేకుండా ఆచార్యులకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలన్నార...

నిత్యం వార్డుల్లో పర్యటిస్తా...మేయర్ పీలా

చిత్రం
 జీవీఎంసీ ఉన్నతాధికారులతో మేయర్ సమీక్ష మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విశాఖపట్నం ఏప్రిల్ 28: నగర ప్రజలకు కల్పించవలసిన మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో జీవీఎంసీ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అందించే మౌలిక వసతులపై , నగర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలకు కల్పించవలసిన  ప్రజారోగ్యం, వీధిలైట్లు, తాగునీరు మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ ప్రజారోగ్యం దిశగా నిత్యం అధికారులు వార్డులలో పర్యటించి పారిశుధ్య మెరుగుకు కృషిచేసి విశాఖ మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీరు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ తాగునీటి విభాగపు అధికారులను ఆదేశించారు. జీవీఎంసీలో అనవసరపు అదనపు ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులన...

'Jagannath Simha' – A Satakam on Lord Jagannath as Narasimha

చిత్రం
 Governor of Odisha released the book  'Jagannath Simha' – A Satakam on Lord Jagannath as Narasimha Visakhapatnam, April 28:  Governor of Odisha, Dr. Kambhampati Hari Babu,  released the book "Jagannath Simha"  in Visakhapatnam.  Authored by Dr. Challa Krishnaveer Abhishek, Executive Director of the Dean Van Leuven Centre for Peace Studies, and Smt. Challa Sruthi Sarani, renowned Carnatic vocalist, the book is a remarkable poetic offering dedicated to Lord Jagannath in his majestic Narasimha form. "Jagannath Simha" is a Satakam poetry anthology comprising one hundred & eight devotional poems, each crafted as an English Keerthana. Blending the timeless spirit of Bhakti with lyrical English expression, the anthology brings forth the fierce yet compassionate image of Lord Jagannath as Narasimha, presenting a bridge between tradition and modernity for a global audience. Dr. Hari Babu commended the authors for their creative innovation, stating that works li...

జగన్నాథ సింహా - శతకం పుస్తకావిష్కరణ

చిత్రం
 జగన్నాథ సింహా - శతకం పుస్తకాన్ని ఆవిష్కరించిన  ఒడిశా గవర్నర్  విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు విశాఖపట్నంలో "జగన్నాథ సింహా" పుస్తకాన్ని విడుదల చేశారు. డీన్ వాన్ లెవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్, కర్ణాటక గాయని  చల్లా శృతి సారణి రచించిన ఈ పుస్తకం, జగన్నాథుడికి నరసింహ రూపంలో అంకితం చేయబడిన ఒక అద్భుతమైన కవితా సమర్పణ. "జగన్నాథ సింహా" అనేది నూట ఎనిమిది భక్తి పద్యాలను కలిగి ఉన్న శతకం, కవితా సంకలనం, ప్రతి ఒక్కటి ఆంగ్ల కీర్తనగా రూపొందించబడింది. భక్తి యొక్క కాలాతీత స్ఫూర్తిని సాహిత్య ఆంగ్ల వ్యక్తీకరణతో మిళితం చేస్తూ, ఈ సంకలనం జగన్నాథుని నరసింహుడిగా అభివర్ణిస్తుంది, ఇది ప్రపంచ ప్రేక్షకులకు సంప్రదాయం మరియు ఆధునికత మధ్య వారధిని ప్రదర్శిస్తుంది. డాక్టర్ హరి బాబు రచయితల సృజనాత్మక ఆవిష్కరణలను ప్రశంసించారు, జగన్నాథ సింహా వంటి రచనలు భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక గొప్పతనాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, అదే సమయంలో ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ...

చిరుధాన్యాలను ఉపయోగించి రాజా రవి వర్మ చిత్రపటం

చిత్రం
  చిరుధాన్యాలతో రాజా రవి వర్మ చిత్రపటం విశాఖపట్నం ఏప్రిల్ 28: భారతీయ ప్రముఖ చిత్రకారుడు రాజా రవి వర్మ జయంతి (April 29) ని పురస్కరించుకొని నగరానికి చెందిన మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ చిరుధాన్యాలను ఉపయోగించి రాజా రవి వర్మ చిత్రాన్ని తీర్చిదిద్దారు. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరును తీసుకువచ్చిన రాజా రవి వర్మ కు కళాకారుడిగా తనదైన శైలిలో జన్మదినం సందర్భంగా వినూత్నంగా నివాళిని అర్పించారు. వారం రోజులుగా శ్రమించి సహజత్వం ఉట్టిపడే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

బంగారు పతకాలకు నగదు బహుకరణ

చిత్రం
 బంగారు పతకాలకు నగదు బహుకరణ ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ విభాగంలో ఎం.ఎల్.ఐ.సి కోర్సులో మొదట ర్యాంక్ సాధించిన విద్యార్థికి బంగారు పతకాన్ని అందజేయాలని కోరుతూ విభాగ విశ్రాంత ఆచార్యులు సి.శశికళ  రూ  1,50,000/- చెక్కును ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ కు అందజేశారు. తమ తల్లిదండ్రులు చాగరి నవనీతమ్మ, నారాయణరెడ్డి ల పేరుతో చాగరి ఎన్ & ఎన్ రెడ్డి గోల్డ్ మెడల్ గా దీనిని విద్యార్థులకు బహుకరించాలని కోరుతూ నగదుకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ గా సేవలందిస్తున్న డాక్టర్ వై.ఆర్ రెడ్డి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి బంగారు పథకాన్ని అందించాలని కోరుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతికి  రూ  1,50,000/- చెక్కును అందజేశారు. తమ తల్లిదండ్రులు వై. సీతారామమ్మ, వెంకట రమణారెడ్డిల పేరు మీదుగా వైయస్ & వైవిఆర్ఆర్ గోల్డ్ మెడల్ గా విద్యార్థులకు దీనిని బహూకరించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కోరారు.  ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస...

సామాజిక సేవతో విశేష గుర్తింపు

చిత్రం
  సామాజిక సేవతో విశేష గుర్తింపు  - ప్రజల సంపూర్ణ వికాసంలో భాగస్వామ్యం కావొచ్చు   సామాజిక సేవతో విశేష గుర్తింపు లభిస్తుందని,ప్రజల సంపూర్ణ వికాసం లో భాగస్వామ్యం కావొచ్చుని ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగధిపతి ప్రొఫెసర్ సర్వసిద్ధి హరనాధ్ పేర్కొన్నారు. మీజోరం సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన సోషల్ వర్క్ విభాగం విద్యార్థులు సోమవారం ఏయు లోని సోషల్ వర్క్ విభాగాన్ని సందర్శించారు.  ఈ సందర్బంగా విభాగధిపతి ప్రొఫెసర్ హరనాధ్ మాట్లాడుతూ సామాజిక సేవలో నిజమైన సంతృప్తి ఉంటుందన్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, కార్పొరేట్, స్వచ్చంద సంస్థ లలో ఉద్యోగాలు ఉన్నాయన్నారు.  విద్యార్థులు అంకిత భావంతో చదువుకొని తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను అర్ధం చేసుకొని ముందుకు సాగాలన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమం లో బిఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ,మిజోరం సెంట్రల్ యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం ఆచార్యులు K. శేఖర్,  డాక్టర్ బాబా వల్లి, అధ్యాపకులు డాక్టర్ అబ్రహం, శ్యామ్ కుమార్, ఆశా కిరణ్, లక్ష్మణరావు, ...

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఒడిస్సా గవర్నర్

చిత్రం
 ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఒడిస్సా గవర్నర్  విశాఖపట్నం ఏప్రిల్ 27:  ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు ఆదివారం ఉదయం సందర్శించారు. ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ గవర్నర్ కి స్వాగతం పలికారు. అనంతరం ఏయు ఉపకులపతి కార్యాలయంలో గవర్నర్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రగతి భవిష్యత్ ప్రణాళికలను ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ గవర్నర్ కు వివరించారు. విద్యార్థులకు  ఉపయుక్తంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, విశ్వవిద్యాలయ అవసరాలకు సరిపోయే విధంగా సౌర విద్యుత్ ఉత్పత్తిని జరిపే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి , విశ్రాంత ఆచార్యులుగా సేవలందించి నేడు ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ గా సేవలందిస్తున్న డాక్టర్ కె. హరిబాబును ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున వీసి రాజశేఖర్ సత్కరించారు.

సరదాగా...ఆవకాయ...సీజన్...

చిత్రం
  మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు ? మహాత్ములు ఇలా చెప్పారు …   మాగాయ:- భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను , బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని.... అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి... పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... సిద్ధిని పొందిన ఋషిలా   ముక్కలు   ఎండి స్థిరత్వాన్ని పొందాక... బయటకు నిర్లేపుడు , నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం   నరుల పట్ల   కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...   బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా ,   తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి , మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని , భక్త జనులనూ కలుపుకున్నట్లు ఉప్పూ కారం మెంతిపిండీ , ఆవపిండి తదితరాలను కలుపుకుని... ఆ స్వామీజీ ప్రవచనాలు , మంత్రోపదేశాలూ , శక్తిపాతాలూ లాంటి    విశేషాలతో వ...

దేశ, ప్రపంచ ప్రగతికి ఏయు దోహదపడింది

చిత్రం
  ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి  –యువ మస్తిష్కాలను మలిచింది  –దేశ, ప్రపంచ ప్రగతికి ఏయు దోహదపడింది విశాఖపట్నం ఏప్రిల్ 26:  ఘనమైన వారసత్వం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయ అభ్యున్నతికి అందరూ సమిష్టిగా కృషి చేస్తూ దీనిని ముందుకు తీసుకువెళ్లాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. మధు మూర్తి అన్నారు. ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల ప్రారంభ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్ లోని ఏ.యూ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేకమంది జీవితాలను స్పృశించింది అని అన్నారు. అదేవిధంగా యువ మస్తిష్కాలను మలచిన ఘనత ఏయూ సొంతమని చెప్పారు. దేశానికి, ప్రపంచ ప్రగతికి దోహదపడిందని అన్నారు. తనకు ఇక్కడ చెప్పలేనన్ని అపురూప జ్ఞాపకాలు ఉన్నాయని విద్యార్థిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయం సొంతమన్నారు. జ్ఞానంతో పాటు విలువలు ఎంతో అవసరమని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేదిగా...

రాష్ట్రానికి విలువైన ఆభరణంగా ఏయూ నిలుస్తోంది

చిత్రం
  ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఖ్యాతి సాధించాలి అత్యుత్తమ బోధనా విధానాలను అమలు చేయండి రాష్ట్రానికి విలువైన ఆభరణంగా ఏయూ నిలుస్తోంది  నగర పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్చి విశాఖపట్నం ఏప్రిల్ 26:   రాష్ట్రానికే తలమానికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తుందని , ఇది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించాలని నగర పోలీస్ కమిషనర్   డాక్టర్ శంఖబ్రతా బాగ్చి అన్నారు . ఈరోజు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం వద్ద శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు . వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు . అనంతరం శతాబ్ది ఉత్సవాల లో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బెలూన్ ను ఎగురవేశారు . ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ బోధనా విధానాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమలు చేయాలని సూచించారు . ఏయూ విద్యార్థులు సాధిస్తున్న ఉద్యోగ అవకాశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు . దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకట...