పోస్ట్‌లు

మే, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

విశాఖ నగరానికే వన్నెతెచ్చారు...

చిత్రం
 క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలవడుతుంది - క్రీడలకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది  - ప్రపంచ పటంలో క్రీడల్లో విశాఖ తన స్థానం పదిలం విశాఖపట్నం మే 31:  క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలబడుతుందని తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని పలువురు శాసనసభ్యులు అన్నారు. శనివారం సాయంత్రం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీగా ఎంపికైన డాక్టర్ డి. భగీరథ కుమార్, ఐ సి ఏ ఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.ప్రసన్న కుమార్ ల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యుల గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. ప్రపంచ పటంలో క్రీడల్లో విశాఖ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది అని అన్నారు. యువత విద్యతోపాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. తద్వారా రాష్ట్రానికి, దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం సాధ్యపడుతుందని అన్నారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్నకుమార్ లు జాతీయస్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణం అని అన్నారు.  విశాఖ నగరానికి, తాము చేపట్టిన పదవులక...

వేలంపూడి జ్యోత్స్న కల్పనకి డాక్టరేట్

చిత్రం
మెరైస్ ఇంజనీరింగ్ లో వేలంపూడి జ్యోత్స్న కల్పనకి డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ లో మెరైస్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని వేలంపూడి జ్యోత్స్న కల్పన, "గ్రాఫీస్ నానోప్లేట్లెట్లు మరియు బోరాస్ కార్బైడ్ నానో పదార్థాలను ఉపరితల మార్పుతో ఉపయోగించి హైబ్రిడ్ కాంపోజిట్ పనితీరు మెరుగుపరచడంపై అధ్యయనం" అనే అంశం పై ఆచార్య వి. వి. ఎస్. ప్రసాద్ పర్యవేక్షణ లో పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో ఆమె అంతర్జాతీయ జర్నళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురించడమే కాకుండా, పలు అంతర్జాతీయ సదస్సుల్లో వ్యాసాలు ప్రచురించారు. తన పరిశోధనలో, గ్లాస్ మరియు జ్యూటస్ ఫైబర్లతో బలపరిచిన ఎపోక్సీ ఆధారిత హైబ్రిడ్ కాంపోజిట్లలో గ్రాఫీస్ నానోప్లేట్లెట్లు మరియు బోరాస్ కార్బైడు నానో ఫిల్లర్లుగా కలపడం ద్వారా మెకానికల్, ఫ్యాటిగ్ మరియు ధర్మల్ లక్షణాలను విశ్లేషించారు. నానోకణాల విస్తరణపై ఉపరితల మార్పు ప్రభావాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా ఆమె పరిశోధన జరిగింది. కాంపోజిట్ నమూనాలను తయారు చేయడానికి వినూత్నమైన vacuum assisted resin transfer molding పద్ధతిని ఉపయోగించారు. ఈ కాంపోజిట్లు సముద్ర వేదికల, టార్పెడో స్, ఆటోనోమస్ గైడెడ్ వెహికల్స్, ...

మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జ‌యంతి వేడుక‌లు

చిత్రం
అట్ట‌హాసంగా మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జ‌యంతి వేడుక‌లు బీచ్ రోడ్, క‌లెక్ట‌రేట్లో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో నివాళుల‌ర్పించిన జిల్లా క‌లెక్ట‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం, మే 28 ః ఆంధ్ర‌ప్ర‌దేశ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి వేడుక‌లు బుధ‌వారం జిల్లాలో అట్ట‌హాసంగా జ‌రిగాయి. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో, ప‌బ్లిక్ ప్ర‌దేశాల్లో వేడుక‌ల‌ను జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వ‌హించింది. దీనిలో భాగంగా ఆర్కే బీచ్ లో ఉన్న స్వ‌ర్గీయ ఎన్టీఆర్ విగ్ర‌హానికి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్య‌మై ఎన్టీఆర్ చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భ‌వానీ శంక‌ర్, ఇత‌ర అధికారులు ఎన్టీఆర్ కు నివాళుల‌ర్పించారు. వివిధ పాఠ‌శాల‌ల నుంచి వ‌చ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. గీతాలాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్.టి. రామారావు సేవ‌ల‌ను కొనియాడారు. ఆ...

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా క్రీడా దుస్తులు పంపిణీ

చిత్రం
 పేదల పాలిట పెన్నిధి నందమూరి తారకరామారావు - ఎన్టీఆర్ జయంతి సందర్భంగా క్రీడా దుస్తులు పంపిణీ  - పోషకాహార పంపిణీ పేదవారి కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చే దిశగా కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారకత రామారావు నిలుస్తారని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా ఎన్టీఆర్ 102 వ జయంతిని విభాగంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య షారోన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సంస్కరణలకు ఎన్టీఆర్ కృషి చేసిన విధానాన్ని వివరించారు.  పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించడం, గృహ నిర్మాణం చేయడం, క్యాపిటేషన్ ఫీజుల రద్దు, వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకుల, ఆశ్రమ పాఠశాలలను నెలకొల్పి విద్యారంగానికి అనే ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. మహిళల కోసం ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా ఉన్నత విద్యను వారికి చేరువ చేసిన విద్యాప్రదాతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలుస్తారని చెప్పారు. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం, 33% రిజర్వ...

'ఆదిత్య' విద్యార్థులకు ర్యాంకుల పంట

చిత్రం
 'ఆదిత్య' విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు ఆదిత్య డిగ్రీ కళాశాల విశాఖపట్నం విద్యార్థులు ఆంధ్రా యూనివర్శిటీ డిగ్రీ కోర్సు వివిధ విభాగాలలో యూనివర్శిటీ ఫలితాలలో 1, 2, 3 ర్యాంక్లను మొత్తం 12 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. బి.సి.ఏ. విభాగం నుండి దున్నా ధనలక్ష్మి 1వ ర్యాంక్ (9.53 సిజిపిఎ), అమ్ూర్ పావని 2వ ర్యాంక్ (9.51 సిజిపిఏ), పెన్మత్స క్యాతిశ్రీ 2వ ర్యాంక్ (9.51 సిజిపిఏ), బొడువు శిరీష 3వ ర్యాంక్ (9.50 సిజిపిఏ), గంగు రిపిక 3వ ర్యాంక్ (9.50 సిజిపిఎ)ను మొదటి మూడు స్థానాలు ఆదిత్య డిగ్రీ బిసిఏ విద్యార్థులు కైవసం చేసుకోగా, బిబిఎ విభాగం సంతనదు కోరిపోలు మహిత 2వ ర్యాంకు (9.04 సిజిపిఏ), వానపల్లి మౌనిక 3వ ర్యాంక్ (9.1 సిజిపిఏ), గుండ్రు వెంకటసాయి కీర్తి 3వ ర్యాంక్ (9.0 సిజిపిఏ), బి.ఎస్సి. విభాగం నుండి మండల యమున 1వ ర్యాంక్ (9.74 సిజిపిఏ), సత్తి మోనిక విషాల్ 3వ ర్యాంక్ (9.72 సిజిపిఏ), బి.కామ్ విభాగం నుండి పల్లేటి పల్లవి 3వ ర్యాంక్ (8.96 సిజిపిఏ), ప్రెసింగ్ హరిప్రియ 2వ ర్యాంక్ (8.96 సిజిపిఏ) మొత్తంగా బిసిఏ విభాగంలో 5 ర్యాంక్లు, బిబిఏ విభాగంలో 3 ర్యాంకులు, బిఎస్సి విభాగంలో 2 ర్యాంకులు, బి.కామ్ వి...

చిత్ర కళ...భళా...

చిత్రం
 ఉన్నత లక్ష్యాలతో యువతరం ఎదగాలి   విద్యార్థులు ప్రతిభతో ఆకట్టుకున్నారు   చిత్రకళా ప్రదర్శన ప్రారంభం జూన్ 1 వరకు కొనసాగుతున్న ప్రదర్శన  ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నతంగా రాణించాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ.నరసింహారావు ఆకాంక్ష వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఏయు చిత్రకళా విభాగంలో ఏర్పాటు చేసిన బిఎఫ్ఏ,ఎంఎఫ్ఏ విద్యార్థుల వార్షిక చిత్రకళా ప్రదర్శనను ఆయన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో అభ్యసించడం గర్వకారణమని చెప్పారు. విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యాలతో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను కార్యరూపంలో చూపుతూ తీర్చిదిద్దిన శిల్పాలు, చిత్రాలు అత్యుత్తమంగా నిలుస్తున్నాయని చెప్పారు. విభాగాధిపతి డి.సింహాచలం మాట్లాడుతూ జూన్ 1వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని అన్నారు. విద్యార్థులు తయారుచేసిన శిల్పాలు, కళారూపా...

హ్యూమన్ జెనెటిక్స్ లో నాగసుధ మయురికి డాక్టరేట్

చిత్రం
హ్యూమన్ జెనెటిక్స్ లో నాగసుధ మయురికి డాక్టరేట్ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ సైన్స్ కళాశాల పరిధిలోని హ్యూమన్ జెనెటిక్స్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని నాగసుధ మయూరి మట్టపర్తి కి డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు వి.లక్ష్మి పర్యవేక్షణలో జెనెటిక్ ఎపిడిమాలజీ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఇన్ విశాఖపట్నం రీజియన్ అనే అంశంపై జరిపిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది.  ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను నాగసుధ మయూరి స్వీకరించారు. తన పరిశోధనలో భాగంగా ఫ్యాటీ లివర్ కి అనారోగ్యకర జీవనశైలితో పాటు జన్యువులు కూడా ముఖ్య కారణంగా నిలుస్తున్నాయని గుర్తించారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే వ్యాధి తీవ్రతను నివారించడం సాధ్యపడుతుందని వివరించారు. తన పరిశోధన విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన తన తండ్రికి, తన గురువు ఆచార్య వి.లక్ష్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మయూరిని విభాగ ఆచార్యులు పరిశోధకులు సిబ్బంది అభినందించారు.

ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

చిత్రం
 ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల  – 95.86% విద్యార్థులు అర్హత రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేశారు ఏ.యు అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసెట్  చైర్మన్, ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ఫలితాలకు సంబంధించిన సిడిని విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు, ఐసెట్ కన్వీనర్ ఆచార్య ఎం.శశి, సహ కన్వీనర్ ఆచార్య కె.రమాసుధ తదితరులు పాల్గొన్నారు. ఐసెట్ ప్రవేశ పరీక్ష కు 37,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 34,131 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది ఉతీర్ణత సాధించారు. పురుషుల విభాగంలో 15863 మంది పరీక్షకు హాజరుకాగా 15,176 మంది అర్హత సాధించారు. బాలికల భాగంలో  18268 మంది పరీక్ష కు హాజరవగా 17543 మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. .  ఐసెట్ ప్రవేశ పరీక్షలో 95.86% మంది ఉతీర్ణత సాధించారు. పరీక్షా రాసిన వారిలో పురుషుల్లో 95.66% మంది , మహిళల్లో 96.03% మంది ఉతీర్ణత సాధించారు. ర్యాంకర్లు వీరే... ఐసె...

స్వచ్ఛత నిత్యజీవితంలో భాగం కావాలి

చిత్రం
 స్వచ్ఛత నిత్యజీవితంలో భాగం కావాలి  - స్వచ్ఛభారత్ కార్యక్రమం క్రమశిక్షణను నేర్పింది  - ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి  విశాఖపట్నం మే 17:  స్వచ్ఛత ప్రజల జీవనంలో అంతర్భాగంగా మారాల్సిన అవసరం ఉందని శాసనమండలి పూర్వ సభ్యులు పి.వి.ఎన్ మాధవ్ అన్నారు. శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని బీఈడీ విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కేవలం పరిశుభ్రత గురించి కాకుండా ప్రజల్లో క్రమశిక్షణను కూడా పెంపొందించిందని చెప్పారు.  అదేవిధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత దేశ వ్యాప్తంగా వచ్చిన మార్పులను ప్రపంచ దేశాలు పరిశీలించాయని, దీనిని అనుసరించడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఇది కేవలం అంతర్గతంగా పరిశుభ్రతను పెంచడమే కాకుండా ప్రజల ఆలోచనలను, దృక్పథాలను ఎంతగానో ప్రభావితం చేసి ఒక మంచి మార్పుకు కారణంగా నిలిచిందని వివరించారు.  స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గాంధీజీ ఆలోచనలు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న నాటి నుంచి స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన...

షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేత ఎల్.మంజుల టీం

చిత్రం
  షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేత డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.మంజుల టీం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద ఉత్సవాల్లో భాగంగా పరిపాలన భవనంలోని మహిళా సిబ్బంది షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 31 మంది మహిళా సిబ్బంది పాల్గొన్నారు. పోటీలు విజేతగా డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.మంజుల, రమా దుర్గ టీం నిలిచారు. ద్వితీయ స్థానంలో ఎన్.సునీత, వై. శివకుమారి, పి.దీపిక  టీం  , తృతీయ స్థానంలో సి.హెచ్ జ్యోతి కుమారి,  మమత  టీం  నిలిచారు.

ఆహా ఆవకాయ్...

చిత్రం
 ఆహా ఆవకాయ్... తెలుగు ప్రజల్లో ప్రతి వంటింటిలో ఆవకాయ జాడీలు కొలువు తీరుతాయి. ఏడాదంతా ప్రతి సందర్భంలోనూ ఎన్ని పిండి వంటలు ఉన్నా ఆవకాయకు స్థానం ఎంతో ప్రత్యేకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆవకాయని కేవలం వేసవికాలంలో మాత్రమే పెడతారు. ఈ కాలంలో లభించే మామిడికాయలతో సుమారు పది రకాలకు పైగా ఆవకాయలు పెట్టడం మన తెలుగు వారికి వెన్నతో పెట్టిన విద్య. మహిళలు సంవత్సరాలుగా ఆవకాయను పెడుతూ దానిలో ఎన్నో మెలకువలు నేర్చుకుని, వారి చేతితో పెట్టిన ఆవకాయతో ఎందరికో ఆహా ఆవకాయి అనిపించుకుంటారు.  ఆవకాయ్ పెట్టడంలో చేయి తిరిగిన మహిళలందరూ ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది. వారంతా కలిసి ఆవకాయ పెడితే దాని రుచి వర్ణించడం సాధ్యం కాదు, సరిగ్గా ఇదే జరిగింది.  విశాఖలోని హోటల్ ఓషన్ విస్టా బేలో మంగళవారం సాయంత్రం మహిళలకు ఆవకాయ తయారు చేసే ఒక పోటీ నిర్వహించారు. సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం, 3 మ్యాంగో స్పైసెస్ అండ్ పికెల్స్ సంస్థలు సంయుక్తంగా  ఆహా ఆవకాయ అనే పోటీని నిర్వహించాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ చేతితో పెట్టిన ఆవకాయని రుచి చూపించారు. మామిడికాయ ముక్కలకు ఆవపిండి, 3 మ్యాంగోస్ కారంపొడి, ...

న్యాయ శాస్త్రంలో హరితకు డాక్టరేట్

చిత్రం
న్యాయ శాస్త్రంలో హరితకు డాక్టరేట్ ఆంధ్ర విశ్వకళాపరిషత్, “డా॥ బి. ఆర్. అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా” విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని లంకె హరిత ‘ఫర్ఫార్మెన్స్ ఎవాల్యూయేషన్ ఆఫ్ “ఆహార భద్రత :- కోవిడ్-19 ప్రభావంపై సామాజిక ఆర్థిక మరియు చట్టపరమైన దృక్పథాలు (ఒక అనుభవిక అధ్యయనం, పాకిస్థాన్ మరియు శ్రీలంకకు ప్రత్యేక సూచన) అనే అంశంపై న్యాయ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్, హానరరీ ప్రొఫెసర్ వి.విజయలక్ష్మి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను 'డా॥ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) పట్టాను సాధించారు.  గౌరవ వైస్ చాన్సలర్ జి.పి.రాజశేఖర్ చేతులమీదుగా  లంకె హరిత డాక్టరేట్  పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా పర్యవేక్షకులు, బోధనా సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. తన ఈ విజయాన్ని తాతగారు, నాన్నమ్మ, తల్లిదండ్రులు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్న, పిన్నిలు, మేనమామ, అత్త, అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెలు, బావ గారు, భర్త మరియు కుమారునికి పి.హెచ్.డి డాక్టరేట్ డిగ్రీని అంకితం చేశారు.

ఐకమత్యమే భారతీయుల బలం

చిత్రం
 ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసి రావాలి - భారత్ కి బాసటగా ప్రపంచ దేశాలు నిలుస్తున్నాయి  - ఐకమత్యమే భారతీయుల బలం  విశాఖపట్నం మే 11:  ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం ద్వారా ప్రపంచశాంతి సాధ్యపడుతుందని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం– దేశ సమైక్యతను పెంపొందిద్దాం– మేరా భారత్ మహాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి సంఘీభావం లభిస్తోందని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కలసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. దేశాల అభివృద్ధికి అవరోధంగా తీవ్రవాదం నిలుస్తోందని చెప్పారు. ప్రజలందరి ఐక్యత మన దేశానికి వెలకట్టలేని సంపదగా నిలుస్తోందని అన్నారు. ఐకమత్యమే భారతీయుల బలమని ప్రపంచం గుర్తించిందని చెప్పారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి విచారకరమని...

విప్లవ జోహార్లు ...మన్యం వీరుడా....

చిత్రం
  మన్యం వీరుడా....స్వాతంత్య్ర ధీరుడా...జోహార్లు.... స్వాతంత్య్ర సమర యోధుడు, గిరిజనుల హక్కులకై పోరాటం చేసిన  మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు ఆధ్వర్యంలో  బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ వద్ద      అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పించారు.  విప్లవ జ్యోతి, విప్లవ వీరుడు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు  విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ మాట్లాడుతూ మన్యం వీరులైనటువంటి, విప్లవ జ్యోతి అయినటువంటి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి చిరస్మయుడుగా మిగిలిపోయారని అన్నారు. మన్యం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన వారి మనసుల్లో చిరస్తాయిగా నిలిచిపోయారని చెప్పారు ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క స్మృతులను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వెలమ మ సంక్షేమ సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి పెద...

ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 90.83 శాతం హాజరు

చిత్రం
 ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 90.83 శాతం హాజరు నమోదు రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన సంయుక్త ప్రవేశ పరీక్ష ఏపీ ఐసెట్ 2025 ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రెండు సెషన్లుగా జరిగిన ఈ పరీక్షకు 37572 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 34131 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 3441 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్ కి90.15 శాతం మంది హాజరవుగా, మధ్యాహ్నం సెషన్ కి 91.52 శాతం మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్రా ష్ట్రంతో పాటు, హైద్రాబాద్ కేంద్రంతో కలుపుకొని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎం శశి తెలిపారు. ఉదయం నిర్వహించిన మొదటి సెషన్ పరీక్ష సెట్ కోడ్ ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ విడుదల చేయగా, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్ష సెట్ కోడ్ ఏయూ రిజిస్ట్రార్ఆ చార్య ఇ.ఎన్ ధనంజయ రావు విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.