పోస్ట్‌లు

లమ్మత ఆశిష్ కుమార్ న్యాయ‌శాస్త్రంలో డాక్ట‌రేట్

చిత్రం
 లమ్మత ఆశిష్ కుమార్ న్యాయ‌శాస్త్రంలో డాక్ట‌రేట్ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అక్టోబ‌ర్ 30: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం న్యాయ క‌ళాశాల ప‌రిశోధ‌క విద్యార్థి ల‌మ్మ‌త ఆశిష్ కుమార్ కు డాక్ట‌రేట్ ల‌భించింది. న్యాయ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  "కన్వర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్: ఎ గ్లోబల్ పెర్స్పెక్టివ్ ఆన్ యాజమాన్య మరియు లయబిలిటీ కాన్‌డ్రమ్" అనే అంశంపై జ‌రిపిన‌ పరిశోధనను డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో ఆశిష్ కుమార్‌కు ఉత్తర్వులు అంద‌జేసి అభినందించారు. కృత్రిమ మేధ ఉప‌యోగించిన త‌యారు చేసిన‌, అభివృద్ధిచేసిన స‌మాచారం, జ్ఞానానికి సంబంధించిన హ‌క్కుల‌ను ఎవ‌రికి ఇవ్వాలి అనే అంశంపై అధ్య‌య‌నం చేశారు. వివిధ దేశాల‌లో దీనికి సంబంధించి చ‌ట్టాలు, వాటి ప‌నితీరు, ప‌రిధిని త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా అధ్య‌య‌నం చేశారు. ఆయన పరిశోధన కృత్రిమ మేధస్సు మరియు మేధో సంపత్తి హక్కుల మధ్య అభివృద్ధి చెందుతున్న ఇంటర్‌ఫేస్‌ను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది, ప్రపంచ న్యాయ శాస్త్రం, శాసన మరియు విధాన దృక్పథాలపై దృష్టి పెడు...

గూగుల్ విశాఖ‌కు రావ‌డం అభివృద్దికి ఉప‌యుక్తం

చిత్రం
 విశాఖ న‌గ‌రం ఐటి రాజ‌ధానిగా అవ‌త‌రిస్తుంది భ‌విష్య‌త్తులో విశాఖ న‌గ‌రం ఐటి, ఏఐ రాజ‌ధానిగా అవ‌త‌రిస్తుంద‌ని విశాఖ జిల్లా బి.సి వెల్ఫేర్ ఫెడ‌రేష‌న్ అద్య‌క్షుడు మండెం సుభాష్ చంద్ర‌బోస్ అన్నారు.  విశాఖ న‌గ‌రంలో గూగుల్ డేటా సెంట‌ర్ ఏర్పాటు స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. ఇటువంటి సంస్థ‌లు విశాఖ‌కు రావ‌డం వ‌ల‌న అనుబంధంగా అనేక సంస్థ‌లు విశాఖ‌కు వ‌స్తాయ‌న్నాత‌రు. త‌ద్వారా ఉపాధి అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా పెరుగుతాయ‌న్నారు. శ‌నివారం ఏయూలోని మ‌హ‌త్మ జ్యోతిరావు ఫూలే విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సుభాష్ చంద్ర‌బోస్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాలలో  భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపే దిశ‌గా,  కూటమి ప్రభుత్వం  విశాఖ నగరంలో గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలను తేవడం జ‌రిగింద‌న్నారు. దీనికి స‌హ‌క‌రించిన‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడుకి, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య విలువలు, పరిపాలన స...

ఆచార్య ల‌లిత భాస్క‌రికి విద్య‌ర‌త్న పుర‌స్కారం

చిత్రం
 ఆచార్య ల‌లిత భాస్క‌రికి విద్య‌ర‌త్న పుర‌స్కారం ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అక్టోబ‌ర్ 25 : ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డి.లలిత భాస్కరి కి విద్యారత్న పురస్కారం లభించింది. హైదరాబాదులోని టీ హబ్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో భారత్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్‌ అవార్డు- 2025 ల‌ వేడుకల్లో భాగంగా ఏఐసిటిఈ సి.ఓ.ఓ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్, జెఎన్‌టియూ కాకినాడ వీసీ ఆచార్య సి.వి.ఆర్.కె.ప్రసాద్ లు ఈ పురస్కారాన్ని లలిత భాస్కరి కి అందించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య ల‌లిత భాస్క‌రిని ఏయూ ఆచార్యులు, అధికారులు అభినందించారు.

ప్రాణాలను రక్షించే విద్య సిపిఆర్

చిత్రం
  ప్రాణాలను రక్షించే విద్య సిపిఆర్   ఏయూ హెల్త్ సెంటర్లో సిపిఆర్ శిక్షణ కార్యక్రమం అత్యవసర సమయంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్  అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హెల్త్ సెంటర్లో సెయింట్ లూక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విజయ లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జెడిఎస్ హాస్పిటల్తో సంయుక్తంగా నిర్వహించిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని రక్షించే సాధనంగా సిపిఆర్ నిలుస్తుందని చెప్పారు.  ప్రతి విద్యార్థి ఇటువంటి అంశాలలో  తగిన తర్ఫీదు అవగాహన పొందాలని సూచించారు. తద్వారా తమ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులను వారి ప్రాణాలను రక్షించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో యువత సిపిఆర్ చేసే విధానాన్ని నేర్చుకోవడం, స్వయంగా చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను రక్షించే  అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వర్సటీలో పెద్దెత్తున విద్యార్థులకు సిపిఆర్ పై శిక్షణ అందిస్తున్నామన్నారు. దీనిలో కొందరిని మాస్...

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది కప్ పోస్ట‌ర్ ఆవిష్క‌రణ

చిత్రం
 ఏయూ శ‌తాబ్ధి క్రీడాసంబ‌రాల‌కు శ్రీ‌కారం - 24న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది కప్ ప్రారంభోత్సవ వేడుక ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి క్రీడా సంబ‌రాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా విశ్వ‌విద్యాల‌యం క్రీడా విభాగం ఆధ్వ‌ర్యంలో యువ‌త‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, వారిలోని క్రీడా ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే వేదిక‌ను సిద్దం చేసింది. విశ్వ‌విద్యాల‌య చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఒక నూత‌న క్రీడా సంబ‌రానికి ఏయూ సిద్ద‌మైంది.  ఈ నెల 24వ తేదీ మ‌ద్యాహ్నం 2 గంట‌ల‌కు ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం వేదిక‌గా ఆంధ్ర‌విశ్వ‌విద్యాలయ శ‌తాబ్ధి క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను ఏయూ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. యువ‌త క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీల‌లో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు.  క్రికెట్ టోర్న‌మెంట్ ఆరంభం నుంచి యువ‌త‌లో ధీటైన పోటీని, ప్ర‌తిభ‌ను ప్ర‌త‌ర్శించే వేదిక‌గా నిలుస్తోంది. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మ‌రిత ఉత్కంఠ‌ను, క్రీడాకారుల్లో ఆస‌క్తిని పెంచుతూ నిర్వ‌...

లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్ కు విరాళం

చిత్రం
లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్ కు విరాళం  లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్ నందు డెర్మటాలజీ విభాగాన్ని స్థాపించడానికి మరియు మల్టీ యుటిలిటీ ఫోటోథెరపీ యూనిట్ 12NBUVB (311nm) ఫిలిప్స్ హాలండ్ కొనుగోలు కోసం లయన్ కొండపనేని అజయ్ కుమార్ గారు, వారి ధర్మపత్ని మరియు చురుకైన సామాజిక కార్యకర్త అయిన కీర్తిశేషులు శ్రీమతి కె.శ్యామలా కుమారి గారి జ్ఞాపకార్థం, రూ.1,05,000/- (రూపాయలు ఒక లక్ష ఐదు వేలు మాత్రమే), ఉదారంగా విరాళం ఇచ్చారు. ఈ రోజు వారు హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు గారికి చెక్ అందించారు. మన కమ్యూనిటీలోని చర్మవ్యాధి రోగులకు సహాయం చేయడంలో ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది. ఒక గొప్ప కారణం కోసం  సహాయం చేసిన లయన్ కొండపనేని అజయ్ కుమార్ గారికి  ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్ సభ్యులు ఎస్. వి.వి. ఎస్. మూర్తి గారి సహకారానికి ధన్యవాదాలు.   లయన్.డాక్టర్.వి.ఉమా మహేశ్వరరావు  మేనేజింగ్ ట్రస్టీ  లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్, విశాఖపట్నం

దీపావళి ఐదు రోజుల పండుగ

చిత్రం
దీపావళి, దీపాల గొప్ప పండుగ, సమీపిస్తోంది. ఈ పండుగ ఉత్సాహం, ఆనందం మరియు ఐక్యతను తెస్తుంది, భారతదేశం అంతటా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఇళ్లను వెలిగిస్తుంది. దీపావళి సంవత్సరంలో కార్తీక మాసం 15వ రోజు (అమావాస్య రోజు) వస్తుంది. మట్టి దీపాలు, ఆకాశ దీపాలు మరియు విద్యుత్ దీపాలతో దేవాలయాలు, గృహాలు, కార్యాలయాలు, దుకాణాలు మరియు వీధులను ప్రకాశవంతం చేయడంతో దీనిని అందమైన కాంతితో జరుపుకుంటారు.  దీపావళిని అమావాస్య తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2025) అమావాస్య తిథి రెండు రోజులలో, అక్టోబర్ 20 మరియు 21న వస్తుంది. ఇది అక్టోబర్ 20న మధ్యాహ్నం 3.44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21న సాయంత్రం 5.54 గంటలకు ముగుస్తుంది, కాబట్టి దీనిని అక్టోబర్ 20న జరుపుకోవాలి. లక్ష్మీ పూజ ముహూర్తం అక్టోబర్ 20న సాయంత్రం 7.08 నుండి రాత్రి 8.18 గంటల మధ్య జరుగుతుంది. ప్రదోష కాలం అక్టోబర్ 20న సాయంత్రం 5.46 నుండి రాత్రి 8.18 వరకు మరియు వృషభ కాలం అక్టోబర్ 20న రాత్రి 7.08 నుండి రాత్రి 9.03 వరకు.  ప్రతి సంవత్సరం, దీపావళి హృదయాలను ఆనందంతో, ఇళ్లను కాంతితో నింపుతుంది, జ్ఞాపకాలను గుర్తుంచుకుంటుంది. చెడుపై మంచి విజయానికి...