శతాబ్ది ఉత్సవ సమారంభం
శతాబ్ది ఉత్సవ సమారంభం ఘనంగా ఏయు శతాబ్ది సంవత్సర వేడుకలు ప్రారంభం జయహో ... ఏయు నినాదాలతో హోరెత్తిన సాగరతీరం విశ్వానికే మణిహారం... ఆంధ్ర విశ్వవిద్యాలయం ... విశాఖపట్నం ఏప్రిల్ 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం సాగర తీరంలో కాళీమాత ఆలయం వద్ద నుంచి ఏయు కన్వెన్షన్ సెంటర్ వరకు వాకతాన్ కార్యక్రమం నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ ఏయూ అధికారులు, పూర్వ ఉపకులపతులతో కలసి ప్రారంభించారు. విద్యార్థుల జయ జయ ద్వానాలతో.... జయహో ఏయు నినాదాలతో... సాగర తీరం హోరెత్తింది. వందలాది మంది విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది తరలిరాగా ఏయు కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ కన్నుల పండుగగా సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ విశిష్టతను చాటే విధంగా విద్యార్థులు నినాదాలు ఇస్తూ, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. అనంతరం ఏయు కన్వెన్షన్ సెంటర్ వద్ద విద్యార్థులను ఉద్దేశించి ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా విశ్వ కళామతల్లి ఆవిర్భవించిందని చెప్పారు. విశ్...