బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్
ఔట్సోర్సింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పై పరిశోధనకు బొటుకు రమేష్ బాబుకు డాక్టరేట్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లాకళాశాలలో పిహెచ్డివిద్యార్థి అయినబొటుకు రమేష్ బాబుకు "ఔట్సోర్సింగ్ ఉపాధి: భారత రాజ్యాంగం మరియు పారిశ్రామిక న్యాయ శాస్త్రానికి విరుద్ధం" అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రకటించింది. పరిశోధనకు కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.విజయ లక్ష్మి గారు గైడ్ మరియు రీసెర్చ్ డైరెక్టర్ గా మార్గనిర్దేశం చేశారు. వీరి పరిశోధన ప్రభుత్వ రంగ మరియు ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలలోని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్డ్ ఉద్యోగుల స్థితిగతులపై దృష్టి సారించింది, అనుభవపూర్వక అధ్యయనం ద్వారా ఈ ఉద్యోగులు తరచుగా యజమానులచే తీవ్రంగా దోపిడీ చేయబడుతున్నారని, చట్టబద్ధమైన ప్రయోజనాలు మరియు సామాజిక రక్షణను పొందలేకపోతున్నారని గుర్తించింది. అవుట్సోర్సింగ్ పద్ధతిపై నియామకం ఉద్యోగుల మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల జీవితాలకు హానికరమని, వారి జీవించే హక్కు మరియు గౌరవాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనం వెల్లడించింది. ఔట్సోర్సింగ్ వ్యవస్థ తరచుగా ఒక మోసపూరిత...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి