పోస్ట్‌లు

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా డా. ఎం. సృజన దేవి

చిత్రం
‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా  డా.ఎం.సృజన దేవి విశాఖ‌ప‌ట్నం, డిసెంబర్ 21, 2025: ఫ‌రెవ‌ర్ స్టార్ ఇండియా – మిస్ యూనివర్స్ ఇండియా 2025 గ్రాండ్ ఫినాలే విజేత‌గా న‌గ‌రానికి చెందిన డాక్ట‌ర్ సృజ‌న దేవి ఎంపిక‌య్యారు. ఇటీవ‌ల  జైపూర్‌లోని Z స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించిన తుది పోటీల‌లో డాక్ట‌ర్ సృజ‌న ఆల్‌రౌండ్ ప్ర‌తిభ‌తో విజేత‌గా నిల‌చారు.దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది పోటీదారుల నుంచి, 100 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. పలు దశల పోటీల అనంతరం ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, మేధస్సు, సామాజిక అవగాహనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన డా. ఎం. సృజన దేవి (ఎం.డి – అనస్థీషియా) ‘ఫారెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా విజేతగా నిలిచారు. ఈ జాతీయ స్థాయి పోటీలను సీఈఓ రాజేష్ అగ‌ర్వాల్‌ మరియు డైరెక్టర్ జ‌య చౌహాన్‌ సమర్థ నాయకత్వంలో నిర్వహించారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న డా. సృజన దేవి నేడు సాధించిన‌ విజయం, యువతకు, మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. గ్రాండ్ ఫినాలేలో డా. ఎం. సృజన దేవి కి ప్రత్యేకంగా అశ్వ‌త్థ మేకోవ‌ర్ సంస్థ, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ - మేకప్ ఆర్టిస్ట్ మిస్ రాజి పర్యవేక్షణలో స్టైలింగ్ చేసింది. ఈ ...

సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

చిత్రం
 సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌ విశాఖ‌ప‌ట్నం, డిసెంబ‌ర్ 16: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కామ‌ర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి, సింబ‌యాసిస్ టెక్నాల‌జీస్ సిఈఓ ఓరుగంటి న‌రేష్ కుమార్‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఆర్ట్స్ కామ‌ర్స్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.న‌ర‌సింహా రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌ర్క్‌ప్లేస్ డైన‌మిక్స్ అండ్ చాలెంజెస్ ఇన్ ద ఐ.టి సెక్టార్ పోస్ట్ పేండ‌మిక్‌- ఏ కేస్ స్ట‌డీ ఆన్ వ‌ర్క్ ఫ్రం-హోం ఇన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే అంశంపై జ‌రిపిన పరిశోధ‌న‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను న‌రేష్ కుమార్‌కు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విభాగ ఆచార్యులు, ప‌రిశోధ‌కులు, శ్రేయోభిలాషులు న‌రేష్ కుమార్‌ను అభినందించారు. అనంతరం నరేష్ కుమార్ ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు తన కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప‌నిచేసే కార్యాలయ గతిశీలత మరియు కోవిడ్‌ మహమ్మారి అనంతర ఐటీ రంగంలో సవాళ్లు: ఆంధ్రప్రదేశ్‌లో వర్క్-ఫ్రమ్-హోమ్ పై ఒక అధ్యయనం అనే అంశంపై న‌రేష్ కుమార్ త‌న ప‌రిశోధ‌న జ‌రిపార...

ఆక‌ట్టుకుంటున్న కొఠారి వ‌జ్రాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌న

చిత్రం
  మ‌గువ‌ల మ‌న‌సుదోచే వ‌జ్రాభ‌ర‌ణాలు -ఆక‌ట్టుకుంటున్న కొఠారి డైమండ్స్   ప్ర‌ద‌ర్శ‌న‌ విశాఖ‌ప‌ట్నం, డిసెంబ‌ర్ 14: మ‌గువ‌ల మ‌న‌సుల‌ను దోచే వ‌జ్రాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభ‌మైంది. బీచ్‌రోడ్డులోని గ్రాండ్ బే హోట‌ల్ వేదిక‌గా కొఠారి డైమండ్, జ్యుయలరీ ప్రదర్శన ప్రారంభించారు. సంస్థ ఎండీ సరేజష్ కొఠారి జ్యోతి వెలిగించి ప్రదర్శనను  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 15 తేదీ వరకు డైమండ్ ఆభరణాల ప్రదర్శన అందుబాటులో ఉంటుందని తెలిపారు.  అదే విధంగా ప్రతి గ్రాము బంగారంపై 3 శాతం తరుగుతో రాయితీ ఇస్తున్నానమని తెలిపారు. ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలు. చెవి దుద్దులు, ఉంగరాలు, గొలుసులు, డైమండ్ నక్లేస్లతో పాటు మరిన్ని డైమండ ఆభరణాలు అందుబాటులో ఉంచామని మన్నారు. వైవిధ్య‌మైన డిజైన్ల‌తో విశాఖ వాసుల మ‌న‌సుల‌ను గెలుచుకునే ఆభ‌ర‌ణాలు కొలువుతీరాయ‌ని చెప్పారు. 

టేకి య‌శ్వంత్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

చిత్రం
 టేకి య‌శ్వంత్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, డిసెంబ‌ర్ 9: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కామ‌ర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి టేకి య‌శ్వంత్ కుమార్‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. విభాగ ఆచార్యులు ఎన్‌.కిషోర్ బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐదు న‌గ‌రాల‌లో వినియోగ‌దారుల వైఖ‌రులు, వినియోగిస్తున్న వస్తువుల‌ను మార్పు చేయ‌డం, సేల్స్ ప్ర‌మోష‌న్స్‌, బ్రాండ్ లాయ‌ల్టీపై ప్ర‌భావం చూపే అంశాలపై అధ్య‌య‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా య‌శ్వంత్ కుమార్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో డాక్ట‌రేట్ ఉత్త‌ర్వులు అంద‌జేసి అభినందించారు.  త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా య‌శ్వంత్ కుమార్ వాణిజ్య రంగానికి ఉప‌యుక్తంగా నిల‌చే డిజిట‌ల్ టు ఫిజిక‌ల్ క‌స్ట‌మ‌ర్ ట్రాన్సిష‌న్ (డిపిసిటి) మోడ‌ల్‌ను అభివృద్ధి చేసారు. ఈ మోడ‌ల్‌ను ఉప‌యోగించి ఒక నిర్ధిష్ట ప్రాంతంలో నూత‌నంగా ఒక స్టోర్‌ను ఏర్పాటు చేయ‌డానికి, సేల్స్ జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉన్న‌దీ, లేనిదీ ముందుగానే తెలుసుకునే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. నూత‌నంగా వ్యాప‌ర సంస్థ‌ల‌ను నెల‌కొల్పాల‌ని భావించే వారికి అక్క‌డ విని...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

చిత్రం
  ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న - రూ 4.5 కోట్ల‌తో హాస్ట‌ల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, డిసెంబ‌ర్ 5 : ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని  7 వ తేదీన  వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్య‌క్షులు ఐ.వి.ఎన్‌.ఎస్‌.కె విశ్వ‌నాథ రావు తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం సంఘం కార్యాల‌యంలో వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సమావేశానికి  ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజశేఖర్  గౌరవ అతిథిగా హాజ‌ర‌వుతారు.  ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా ప‌ట్ట‌భ‌ద్రులైన‌  పూర్వ విద్యార్థులు పెద్ద‌సంఖ్య‌లో ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వ‌విద్యార్థులు త‌మ ప్ర‌యాణాన్ని, ప్ర‌గ‌తిని, అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఈ సంద‌స్భంగా పం...

ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’ ప్రారంభం

చిత్రం
  ఓయాసిస్ ఫెర్టిలిటీ — విశాఖపట్నం నుండి ‘ జనని యాత్ర ’ ప్రారంభం   సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంచే ఉద్యమం విశాఖపట్నం , 24 నవంబర్ 2025: తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది జంటలకి ఆశను కల్పించి , అవగాహనను పెంచిన తర్వాత , భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఓయాసిస్ ఫెర్టిలిటీ , రెండో విడత ‘ ఓయాసిస్ జనని యాత్ర ’ అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని 24 నవంబర్ 2025 న విశాఖపట్నం నుండి ప్రారంభించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   ఎమ్మెల్యే   గంటా శ్రీనివాస్ గారు మరియు , ఎమ్మెల్యే   వంశీ    కృష్ణ‌  శ్రీనివాస్ గారు , అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు . ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి , తల్లిదండ్రులవాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యం తో ప్రారంభమైంది . ఆంధ్రప్రదేశ్ ‌ లో ఫెర్టిలిటీ రేటు 1.5 కి పడిపోవడం , ఇది 2.1 రీప్లేస్ ‌ మెంట్ స్థాయికి చాలా తక్కువ , ఈ ...

మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్‌

చిత్రం
  మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్‌ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం మెరైన్ ఇంజ‌నీరింగ్ విభాగ ప‌రిశోధ‌క విద్యార్థి మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్ ల‌భించింది. విభాగ ఆచార్యులు వి.వి.ఎస్. ప్రసాద్ మార్గదర్శకత్వంలో  "కంప్యూటేషనల్ అండ్ ఎక్సపెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎన్ యానులర్ కుకింగ్ బౌల్ ఫర్ నాన్-సెంట్రిఫ్యూగల్ కేన్ షుగర్ యూనిట్ యూజింగ్ ఫుడ్-గ్రేడ్ ఆయిల్ అండ్ గ్రాఫిన్ నానోప్లేట్ లెట్ డిస్ఫర్షన్స్"  అంశంపై చేసిన పరిశోదన కు డాక్ట‌రేట్ ల‌భించింది. సాంప్ర‌దాయ విధానంలో చెరుకు పిప్పిని మండించి బెల్లం త‌యారీ జ‌రుపుతుంటారు. దీనికి ప్ర‌త్యామ్నాయ విధానాన్ని ప‌ర్య‌వార‌ణ‌హిత సాంకేతిక‌త‌ల‌ను అభివృద్ధి చేసారు. మొహమ్మద్ అబ్దుల్ రజాక్ తన పరిశోధన ఫలితాలను నాలుగు ప్రఖ్యాత అంతర్జాతీయ జ‌ర్న‌ల్స్‌లో ప్రచురించారు. ఏయూ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్  నుంచి డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న స్వీక‌రించారు.   మెరైన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు, కుటుంబ స‌భ్య‌లు అభినందనలు తెలిపారు. ప్ర‌స్తుతం అబ్దుల్ ర‌జాక్ గీతం విశ్వ‌విద్యాల‌యంలో ప‌నిచేస్తున్నారు.