పోస్ట్‌లు

డిసెంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం

చిత్రం
 వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం విశాఖపట్నం 24 డిసెంబర్ 2025: స్థానిక మధురవాడ లోని లాభాపేక్షలేని ప్రముఖ ధార్మిక సంస్థ వేదాంత ఇనిస్టిట్యూట్. ఇది ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ ఎ.పార్థసారధి గారి సారధ్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వేదాంత అధ్యయనాలు, పరిశోధనలు మరియు వేదాంత అంశాలు ప్రచారానికి కృషి చేస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం జాతి, మత, వర్ణ వివక్ష లేకుండా అందరికి ఆధ్యాత్మిక అంశాలు పంచటం, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఆదర్శాలు పాటించే విధంగా యువతరాన్ని ప్రేరేపించటం, ఉత్తమ మార్గం వైపు వారిని నడిపించటం కోసం వేదాంత  ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ వేదాంత చారిటబుల్ సంస్థ నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల కొరకు సిక్కు మతానికి చెందిన విశాఖపట్నం నివాసి శ్రీ సతీందర్ సింగ్ సేథీ ఈరోజు రూ.25,000/- విరాళం అందచేసారు.ఆయన విశాపట్నంలోని మూడు గురుద్వారాలలో సభ్యులుగా ఉన్నారు. పరోపకార పరాయణులు. సంస్థ నిర్వహించు రోజు వారీ సేవా కార్యక్రమాలకు ఈ విరాళం అందచేసినట్లు శ్రీ సతీందర్ సింగ్ సేథీ తెలిపారు. అంతేకాక వేదాంత సంస్థ భవిష్యత్తులో నిర్వహించు కార్యక్రమాలలో తాను కీలక పాత్రను పోషిస్తానని ఆయన చెప్పారు.ఈ సందర్భ...

న్యూలుక్‌తో నీరూస్...న‌గ‌ర‌వాసుల‌కు స‌రికొత్త అనుభూతి..

చిత్రం
  న్యూలుక్‌తో నీరూస్...న‌గ‌ర‌వాసుల‌కు స‌రికొత్త అనుభూతి.. . విశాఖన‌గ‌రంలో వ‌స్త్ర ప్రియుల‌కు స‌రికొత్త వ‌స్త్ర ప్ర‌ప‌చం క‌నువిందు చేయ‌నుంది. డ్రేప్స్-డివాస్, ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ సహకారంతో నీరు యొక్క న్యూలుక్ తో సిద్ద‌మైంది. ఎఫ్ఐసిసిఐ, ఎఫ్ఎల్ఓ ద్వారా క్యూరేట్ చేయబడిన నీరు'స్ న్యూ లుక్ ప్రత్యేక సంబరాన్ని డ్రేప్స్ & డివాస్ ప్రదర్శించిన ప్రథమమైన అనుభవజన్య ఫ్యాషన్ సాయంత్రాన్ని విశాఖపట్నం ఇటీవల సాక్ష్యంగా నిలిచింది. ఈ కార్యక్రమం నీరూస్‌ ఇండియన్ ఎథ్నిక్ వేర్ , రెడ్ మ్యాగజైన్ ఈవెంట్, మీడియా పార్టనర్ గా  వ్య‌వ‌హ‌రించింది.  సమకాలీన దృక్పథంతో తిరిగి ఊహించడంతో పాటు, ఫ్యాషన్, సంగీతం మరియు సంస్కరించబడిన సామాజిక నిశ్చయార్ధాన్ని నిరవధికంగా కలిపింది. సంప్రదాయ ఫ్యాషన్ ప్రదర్శన కంటే మించి, అతిథులకు శ్రద్ధగా క్యూరేట్ చేయబడిన అనుభవాన్ని అందించిన ఈ సాయంత్రం దాని ఎలిగెన్స్ మరియు వ్యక్తిత్వం కోసం గుర్తింపు పొందింది. సంపత్ వినాయక టెంపుల్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమం ఆధునీక‌రించిన నీరూస్‌ పునరుద్ధరించబడిన ఫ్లాగ్షిప్ స్టోర్ యొక్క కొత్త లుక్ తో ఆరంభ‌మైంది. ఈ కార్యక్రమానికి  నీరూస్  ఎం.డి అవ...

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా డా. ఎం. సృజన దేవి

చిత్రం
‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా  డా.ఎం.సృజన దేవి విశాఖ‌ప‌ట్నం, డిసెంబర్ 21, 2025: ఫ‌రెవ‌ర్ స్టార్ ఇండియా – మిస్ యూనివర్స్ ఇండియా 2025 గ్రాండ్ ఫినాలే విజేత‌గా న‌గ‌రానికి చెందిన డాక్ట‌ర్ సృజ‌న దేవి ఎంపిక‌య్యారు. ఇటీవ‌ల  జైపూర్‌లోని Z స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించిన తుది పోటీల‌లో డాక్ట‌ర్ సృజ‌న ఆల్‌రౌండ్ ప్ర‌తిభ‌తో విజేత‌గా నిల‌చారు.దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది పోటీదారుల నుంచి, 100 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. పలు దశల పోటీల అనంతరం ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, మేధస్సు, సామాజిక అవగాహనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన డా. ఎం. సృజన దేవి (ఎం.డి – అనస్థీషియా) ‘ఫారెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా విజేతగా నిలిచారు. ఈ జాతీయ స్థాయి పోటీలను సీఈఓ రాజేష్ అగ‌ర్వాల్‌ మరియు డైరెక్టర్ జ‌య చౌహాన్‌ సమర్థ నాయకత్వంలో నిర్వహించారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న డా. సృజన దేవి నేడు సాధించిన‌ విజయం, యువతకు, మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. గ్రాండ్ ఫినాలేలో డా. ఎం. సృజన దేవి కి ప్రత్యేకంగా అశ్వ‌త్థ మేకోవ‌ర్ సంస్థ, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ - మేకప్ ఆర్టిస్ట్ మిస్ రాజి పర్యవేక్షణలో స్టైలింగ్ చేసింది. ఈ ...

సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

చిత్రం
 సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌ విశాఖ‌ప‌ట్నం, డిసెంబ‌ర్ 16: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కామ‌ర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి, సింబ‌యాసిస్ టెక్నాల‌జీస్ సిఈఓ ఓరుగంటి న‌రేష్ కుమార్‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఆర్ట్స్ కామ‌ర్స్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.న‌ర‌సింహా రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌ర్క్‌ప్లేస్ డైన‌మిక్స్ అండ్ చాలెంజెస్ ఇన్ ద ఐ.టి సెక్టార్ పోస్ట్ పేండ‌మిక్‌- ఏ కేస్ స్ట‌డీ ఆన్ వ‌ర్క్ ఫ్రం-హోం ఇన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే అంశంపై జ‌రిపిన పరిశోధ‌న‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను న‌రేష్ కుమార్‌కు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విభాగ ఆచార్యులు, ప‌రిశోధ‌కులు, శ్రేయోభిలాషులు న‌రేష్ కుమార్‌ను అభినందించారు. అనంతరం నరేష్ కుమార్ ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు తన కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప‌నిచేసే కార్యాలయ గతిశీలత మరియు కోవిడ్‌ మహమ్మారి అనంతర ఐటీ రంగంలో సవాళ్లు: ఆంధ్రప్రదేశ్‌లో వర్క్-ఫ్రమ్-హోమ్ పై ఒక అధ్యయనం అనే అంశంపై న‌రేష్ కుమార్ త‌న ప‌రిశోధ‌న జ‌రిపార...

ఆక‌ట్టుకుంటున్న కొఠారి వ‌జ్రాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌న

చిత్రం
  మ‌గువ‌ల మ‌న‌సుదోచే వ‌జ్రాభ‌ర‌ణాలు -ఆక‌ట్టుకుంటున్న కొఠారి డైమండ్స్   ప్ర‌ద‌ర్శ‌న‌ విశాఖ‌ప‌ట్నం, డిసెంబ‌ర్ 14: మ‌గువ‌ల మ‌న‌సుల‌ను దోచే వ‌జ్రాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభ‌మైంది. బీచ్‌రోడ్డులోని గ్రాండ్ బే హోట‌ల్ వేదిక‌గా కొఠారి డైమండ్, జ్యుయలరీ ప్రదర్శన ప్రారంభించారు. సంస్థ ఎండీ సరేజష్ కొఠారి జ్యోతి వెలిగించి ప్రదర్శనను  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 15 తేదీ వరకు డైమండ్ ఆభరణాల ప్రదర్శన అందుబాటులో ఉంటుందని తెలిపారు.  అదే విధంగా ప్రతి గ్రాము బంగారంపై 3 శాతం తరుగుతో రాయితీ ఇస్తున్నానమని తెలిపారు. ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలు. చెవి దుద్దులు, ఉంగరాలు, గొలుసులు, డైమండ్ నక్లేస్లతో పాటు మరిన్ని డైమండ ఆభరణాలు అందుబాటులో ఉంచామని మన్నారు. వైవిధ్య‌మైన డిజైన్ల‌తో విశాఖ వాసుల మ‌న‌సుల‌ను గెలుచుకునే ఆభ‌ర‌ణాలు కొలువుతీరాయ‌ని చెప్పారు. 

టేకి య‌శ్వంత్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

చిత్రం
 టేకి య‌శ్వంత్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, డిసెంబ‌ర్ 9: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కామ‌ర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి టేకి య‌శ్వంత్ కుమార్‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. విభాగ ఆచార్యులు ఎన్‌.కిషోర్ బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐదు న‌గ‌రాల‌లో వినియోగ‌దారుల వైఖ‌రులు, వినియోగిస్తున్న వస్తువుల‌ను మార్పు చేయ‌డం, సేల్స్ ప్ర‌మోష‌న్స్‌, బ్రాండ్ లాయ‌ల్టీపై ప్ర‌భావం చూపే అంశాలపై అధ్య‌య‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా య‌శ్వంత్ కుమార్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో డాక్ట‌రేట్ ఉత్త‌ర్వులు అంద‌జేసి అభినందించారు.  త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా య‌శ్వంత్ కుమార్ వాణిజ్య రంగానికి ఉప‌యుక్తంగా నిల‌చే డిజిట‌ల్ టు ఫిజిక‌ల్ క‌స్ట‌మ‌ర్ ట్రాన్సిష‌న్ (డిపిసిటి) మోడ‌ల్‌ను అభివృద్ధి చేసారు. ఈ మోడ‌ల్‌ను ఉప‌యోగించి ఒక నిర్ధిష్ట ప్రాంతంలో నూత‌నంగా ఒక స్టోర్‌ను ఏర్పాటు చేయ‌డానికి, సేల్స్ జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉన్న‌దీ, లేనిదీ ముందుగానే తెలుసుకునే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. నూత‌నంగా వ్యాప‌ర సంస్థ‌ల‌ను నెల‌కొల్పాల‌ని భావించే వారికి అక్క‌డ విని...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

చిత్రం
  ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న - రూ 4.5 కోట్ల‌తో హాస్ట‌ల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, డిసెంబ‌ర్ 5 : ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని  7 వ తేదీన  వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్య‌క్షులు ఐ.వి.ఎన్‌.ఎస్‌.కె విశ్వ‌నాథ రావు తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం సంఘం కార్యాల‌యంలో వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సమావేశానికి  ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజశేఖర్  గౌరవ అతిథిగా హాజ‌ర‌వుతారు.  ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా ప‌ట్ట‌భ‌ద్రులైన‌  పూర్వ విద్యార్థులు పెద్ద‌సంఖ్య‌లో ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వ‌విద్యార్థులు త‌మ ప్ర‌యాణాన్ని, ప్ర‌గ‌తిని, అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఈ సంద‌స్భంగా పం...