యువతలో దేశభక్తి పెంపొందించాలి
యువతలో దేశభక్తి పెంపొందించాలి
స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలన భవనం వద్ద నుంచి 400 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని పట్టుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్.సి.సి వలంటీర్లు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించే విధంగా అటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. భారీ జాతీయ పతాకంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్.సి.సి, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు, డీన్ కె.రమా సుధ, ఎస్ హరినాథ్, ఎన్.ఎం యుగంధర్, డి. సింహాచలం,టి.షారోన్ రాజు,ఏ.పల్లవి అధికారులు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏయూ పరిపాలన భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ సిరిపురం కూడలి మీదుగా ఏయూ ఇన్ గెట్ మీదుగా పరిపాలన భవనం వద్ద ముగిసింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి